రాష్ట్రంలో గ్రూప్-3 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను టీజీపీఎస్సీ ఆదివారం విడుదల చేసింది. ఈ నెల 17, 18 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 17న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. 18న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-3 పరీక్ష ఉండనుంది. ఈ పోస్టులకు 5.36 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం జరిగే పరీక్షలకు 9.30 తర్వాత, మధ్యాహ్నం జరిగే పరీక్షకు 2.30 అనంతరం పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని ఇటీవల టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. అభ్యర్థులు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్టికెట్ కాపీని భద్రంగా పెట్టుకోవాలనీ, తొలి రోజు పేపర్-1 పరీక్షకు హాజరైన హాల్టికెట్ను మిగతా పరీక్షలకు ఉపయోగించాలని పేర్కొంది. ప్రశ్నపత్రాలు, హాల్టికెట్లను నియామక ప్రక్రియ ముగిసేవరకు భద్రంగా పెట్టుకోవాలని సూచించింది.
No comments:
Post a Comment