ఫుడ్ విత్ చిల్డ్రన్
SSC Public examinations reforms from Academic year 2024-25
ప్రభుత్వ విద్యాలయాల్లో మధ్యాహన్న భోజన నాణ్యతను పరిశీలించేందుకు కలెక్టర్ రాహుల్ శర్మ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.విద్యార్థులతో అధికారులు కలిసి భోజనం చేసేలా 'ఫుడ్ విత్ చిల్డ్రన్' పేరుతో అమల్లోకి తెచ్చారు. శుక్రవారం నుంచి జిల్లాలో ఇది కొనసాగనుంది. విద్యార్థులకు అందుతున్న ఆహారం నాణ్యతను పరిశీలించడంతో పాటు మెనూను పాటిస్తున్నారా.. లేదా ? అనే అంశాలను పరిశీలించేందుకు కలెక్టర్ ఈ కార్యక్రమా న్ని రూపొందించారు. జిల్లాలోని 62 వసతి గృహాలు, 432 ప్రభుత్వ పాఠశా లల్లో మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీ వోలు, తహసీ ల్దార్లు, జిల్లా, మండల అధికారులు ఇందులో పాల్గొంటారు. ఆయా హాస్టల్స్, పాఠశాలల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేస్తారు. తద్వారా భోజనం నాణ్యతను పరిశీలిస్తారు.
No comments:
Post a Comment