google-site-verification=IiO5YZ0ILjHMgtweGmnVanjR-Quq8y6lpIXXO7A9-_w PRTUTS: ఐదేళ్లు మంచి రిజల్ట్ ఇవ్వని ఉపాధ్యాయులపై చర్యలు
Flash :1.Continuation of existing system i.e 80% weightage for SSC external assessment and 20% weightage for internal assessment for SSC

Search This Blog

ఐదేళ్లు మంచి రిజల్ట్ ఇవ్వని ఉపాధ్యాయులపై చర్యలు

 విద్యార్థుల ఫలితాల ఆధారంగా పాయింట్లు

పదోన్నతులు, బదిలీల్లో పాయింట్లకు వెయిటేజీ

ఐదేళ్లు మంచి రిజల్ట్ ఇవ్వని ఉపాధ్యాయులపై చర్యలు  టీచర్లలో జవాబుదారీతనం, విద్యా ప్రమాణాలు పెంచడమే లక్ష్యం!



సర్కారుకు విద్యా కమిషన్ సిఫారసు?




ముందు మౌలిక వసతులు కల్పించాలి.



ప్రభుత్వ స్కూళ్ళలో చాలీచాలని వసతులు న్నాయి. పైగా ఈ స్కూళ్లలో పేద వర్గాల నుంచి వచ్చే విద్యార్థులే అత్యధిక సంఖ్యలో చదువుతున్నారు. వారికి నాణ్యమైన విద్య అందిం చాలని ప్రతి టీచర్కూ ఉంటుంది. మంచి ఫలితాలు రావాలంటే అందుకు తగిన వాతావ రణం, వసతులు కల్పించాలి. మంచి ఫలితాలకు వీలుగా తగిన మార్పులు, చేర్పులు చేయాలి. ప్రైవేటు స్కూళ్ళతో పోటీ పెట్టడం సరికాదు. ర్యాంకింగ్ ఇవ్వడం ఎంతమాత్రం సరికాదు.

పింగిలి శ్రీపాల్ రెడ్డి (పీఆర్సీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు)


 ప్రభుత్వ టీచర్లలో అంకిత భావం పెంచడం ద్వారా విద్యా ప్రమాణాల పెంపు దిశగా తీసుకోవాల్సిన చర్యలపై విద్యా కమిషన్ ఇటీవల వివిధ వర్గాల గా టీచర్ల పనితీరుపై ప్రజల నుంచి తీవ్ర అసంతృ ప్తి వ్యక్తమైనట్టు కమిషన్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు సాధిస్తున్న ఫలితాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆయా అంశాలన్నీ దృష్టిలో ఉంచుకుని, విద్యా కమి షన్ సూచనల ఆధారంగా ఉపాధ్యాయుల్లో జవాబు దారీతనం పెంచేలా తీసుకోవాల్సిన చర్యలపై విద్యాశాఖ దృష్టి సారించే అవకాశాలు కన్పి స్తున్నాయి. పలు ప్రభుత్వ స్కూళ్ళల్లో ఫలితాలు దిగదుడుపుగా ఉంటున్నాయి. దీంతో ఏయే సబ్జె కులో ఎంతమంది ఉత్తీర్ణులవుతున్నారు? ఏ స్కూ టీలో ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏ సబ్జెక్టులో మంచి ఫలి తాలు వస్తే. ఆ సబ్జెక్టును బోధించే టీచర్కు ప్రోత్సా హకంగా కొన్ని గ్రేడింగ్ పాయింట్లు ఇచ్చే ఆలో చనలో ఉంది. అదే సమయంలో స్కూల్లో చదివే మొత్తం విద్యార్థుల్లో ఎక్కువ మంది ఒక సబ్జెక్టులో వెనుకబడినట్టైతే అందుకు ఆ టీచర్ను బాధ్యుడిని చేయాలని భావిస్తున్నారు. ఒక టీచర్ చెప్పే సబ్జె క్టులో వరుసగా ఐదేళ్ళ పాటు అతి తక్కువ ఫలి తాలు వస్తే కొన్ని చర్యలు తీసుకునే అంశాన్ని కమి షన్ ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు సమాచారం. కాగా గ్రేడింగ్ విధానంపై అన్ని వర్గాలతో చర్చించి, అవసరమైన విధివిధానాలను రూపొందించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. రాష్ట్రం లోని ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు.. ఇలా మొత్తం 1.26.518 మంది ఉపాధ్యా యులు పనిచేస్తున్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్ కలిపి 30,178 స్కూళ్ళుంటే, ఇందులో 28,80,809 మం ది విద్యాభ్యాసం చేస్తున్నారు.



No comments:

Post a Comment