ప్రజా ప్రాతినిధ్య చట్టం- 1950 లోని సెక్షన్ 27(5%) ని అనుసరించి ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఓటర్ నమోదు. చేసుకునేందుకు ఈ క్రింది అర్హతలు ఉండాలి.
ఉపాధ్యాయులు, అధ్యాపకులు వరంగల్, ఖమ్మం, నల్గొండ లేదా మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ నియోజకవర్గాల్లో నివసిస్తూ ఉండాలి. (ఓటరు నియోజకవర్గం పరిధిలోనే పని చేయాలన్న నియమం లేదు), తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పని చేస్తున్నప్పటికి ఈ నియోజకవర్గ పరిధిలో నివాసం ఉంటున్నట్లయితే వారు ఇక్కడ ఓటరుగా నమోదు కావచ్చు.
2024 నవంబర్ ఒకటో తేది నాటికి ముందున్న ఆరు సంవత్సరాల కాలంలో (అనగా 1.11.2018 నుండి 31.10.2004 వరకు) మూడు సంవత్సరాల కాలానికి తగ్గకుండా ఉన్నత పాఠశాల ఆ పై స్తాయి విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు/అధ్యాపకులుగా పని చేసి ఉండాలి. (మూడు సంవత్సరాల కాలం కంటెన్యూగా ఉండనవసరం లేదు. వేర్వేరు విద్యా సంస్థల్లో విడతలుగా కూడా ఉండొచ్చు)
01.11.2021 కంటే ముందు నియామకం అయిన ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు/ కళాశాలల అధ్యాపకులు ఓటర్లుగా అర్హులు.
ఉపాధ్యాయుడు/ అధ్యాపకుడు రెగ్యులర్ లేదా కాంట్రాక్టు (అడహక్ ) పద్ధతిలో నియమించబడిన ఫుల్ టైం ఉపాధ్యాయుడై ఉండాలి. పార్ట్ టైం, గెస్ట్ టీచర్లు ఓటర్లుగా అర్హులు కారు.
ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాల/ కళాశాలలో ఉపాధ్యాయులు/ అధ్యాపకులు కూడా ఓటరుగా నమోదకు. అర్హులు. అయితే
ఎ) వారి సర్వీసు సర్టిఫికెట్ను జిల్లా స్థాయి పర్యవేక్షణ అధికారి (డిఐకి/డివిఇఓ/ఆర్/ ధృవీకరించాలి/ అటెస్ట్ చెయ్యాలి
బి) UDISEలో నమోదు అయి గత ఆరు సంవత్సరాల కాలంలో చెల్లించలిన జిపిఎఫ్/ ఈపీఎఫ్ వివరాలు ఓటరు నమోదు opro, (κού) . 25 30. 3056/ElE/A9/2016 of CEO Telangana Dt. 29.09.2016 36
4లోని రూల్స్ zvil, vijil ప్రకారం)
పాత ఓటర్ల జాబితా ఉండదు. అర్హులైన ఉపాధ్యాయులు, అధ్యాపకులు అందరూ తాజాగా పేర్లు నమోదు చేసుకోవాలి.
ఓటర్ నమోదు కోసం ఫారం -19 లో దరఖాస్తు చేయాలి, దరఖాస్తు ఫారంపై పాస్పోర్టు వైజ్ కలర్ ఫోటో అంటించాలి. అందుబాటలో ఉంటే సాధారణ (అసెంబ్లీ) ఎన్నికల ఓటర్ వివరాలు దరఖాస్తు ఫారంలో నమోదు చేయాలి.
అంగీకారం ఉంటే ఆధార్ వివరాలు ఇవ్వొచ్చు అవి ఇ.ఆర్.వో. వద్ద గోప్యంగా ఉంచబడుతాయి.
ఉపాధ్యాయులు పనిచేసిన కాలానికి సంబంధించిన అనెగ్జార్- 2 నందరి ప్రొఫార్మాలో ప్రధానోపాధ్యాయుడు లేదా ప్రిన్సిపల్ జారీ చేసిన ధృవపత్రం (సర్వీస్ సర్టిఫికెట్) దరఖాస్తుకు జతచేసి సమర్పించాలి.
పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలను నివాస ప్రాంతాల్లోని సహాయ ఓటర్ నమోదు అధికారి (మండల తహసిల్దార్/మండల విద్యాశాఖాధికారి) కార్యాలయంలో సమర్పించాలి.
ప్రధానోపాధ్యాయుడు / ప్రిన్సిపర్ కవరింగ్ లెటర్ విద్యాసంస్థలకు సంబంధించిన మొత్తం దరఖాస్తులను బర్న్ కూడా సమర్పించవచ్చు.
అన్లైన్లో ధరఖాస్తు చేయదలచిన వారు www.ceotelangana.nic.in వెబ్సైట్లో దరఖాస్తు చేయవచ్చు. ఫోటో సర్వీస్ సర్టిఫికెట్ స్కాన్ చేసి సమ్మిట్ చేయాలి. వెరిఫికేషన్ కోసం నివాసానికి వచ్చినప్పుడు బిఎల్ఎకు సర్వీస్ సర్టిఫికెట్ ఒరిజనర్ అందజేయాలి..
No comments:
Post a Comment